ఉపన్యాస పోటీలలో మెరిసిన విహెచ్ఎస్ విద్యార్థిని
నిజామాబాద్ (చట్టం న్యూస్): స్వామి వివేకానంద 158వ జయంతి సంధర్బంగా రామకృష్ణ సేవా సమితి నిర్వహించిన ఉపన్యాస పోటీలలో నిజామాబాద్కు చెందిన విజయ్ హైస్కూల్ విద్యార్థిని బి.శ్రీహిత మొదటిస్థానంలో నిలిచి బహుమతి గెలుచుకోవడం పట్ల విహెచ్ఎస్ కార్యదర్శి డాక్టర్ అమృతలత హర్షం వ్యక్తం చేసారు.
ఈ సంధర్బంగా విద్యార్థిని బి.శ్రీహితను అభినందించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15పాఠశాలలకు చెందిన 45 విద్యార్థులు ఉపన్యాస పోటీలలో పాల్గొనగా మా విద్యార్థిని బి.శ్రీహిత మెదటిస్థానం కైవసం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ అమృతలతతో పాటు కరస్పాండెంట్ వి.ప్రభాదేవి, తదితరులు పాల్గొన్నారు.

0 Comments:
Post a Comment